లక్షెట్టిపేటలో ద్విచక్ర వాహనాల వేలం పాట

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణ పరిధిలోని స్థానిక ప్రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ లో వివిధ కేసులలో జప్తు చేయబడిన 11 ద్విచక్ర వాహనములకు ఈ నెల 11వ తేదీన ఉదయం 11గంటలకు జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహించబడునని ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఎస్సై బాబా తెలిపారు. ఆసక్తి గల వారు వేలంపాటలో పాల్గొనవచ్చునని,వాహనాలకు సంబంధించి పూర్తివివరాలకు స్థానిక స్టేషన్ లో సంప్రదించలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking