జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 10
వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని నాయిని చెరువు దగ్గర మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎండి అయాజ్, కౌన్సిలర్లు గాజుల భాస్కర్, దయ్యాల శ్రీనివాస్, దిడ్డి రాము, దేశిని సదానందం, బొంగోని వీరన్న, పొన్నగంటి రాము, శ్రీపతి నరేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.