6న వంగవీటి రాధా పెళ్లి

విజయవాడ, ఆగస్టు 16 వంగవీటి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. దానికి ప్రధాన కారణం వంగవీటి రంగా.. ఇక, ఆయన కుమారుడు వంగవీటి రాధా కృష్ణ కూడా రాజకీయాల్లో.. తన కమ్యూనిటీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా విజయవాడలో వంగవీటి ఫ్యామిలీకి పెద్ద ఎత్తున అనుచరులున్నారు.. అయితే, వంగవీటి ఫ్యామిలీని అభిమానించేవారికి, వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. ఎందుకంటే.. వంగవీటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి.. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నాయి..మొదట ఈ నెల 19వ తేదీన వంగవీటి రాధా`జక్కం పుష్పవల్లీల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. కానీ, పలు కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.. పెళ్లి మాత్రం ముందుగా నిర్ణయించిన మూహూర్తానికి అంటే సెప్టెంబర్‌ 6న జరిపించనున్నారు.. వంగవీటి ఫ్యామిలీ అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.. ఆ ఫ్యామిలీతో వియ్యం అందుకునేది ఎవరు? అనే చర్చ ఆసక్తికరంగా సాగు తుంది.. అయితే, వంగవీటి రాధాకు కాబోయే భార్య.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంకు చెందిన అమ్మాయి. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిర్ణయించారు. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లుగా తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. నరసాపురం మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కం ఆమ్మాణి, బాబ్జీల చిన్నకుమార్తె జక్కం పుష్పవల్లీ.. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నారని చెబుతున్నారు.మొదట నర్సాపురంలో ఈ నెల 19వ తేదీన వధువ ఇంట నిశ్చితార్థం నిర్వహించి.. సెప్టెంబర్‌ 6వ తేదీన విజయవాడలో పెళ్లి జరిపించాలనుకున్నారు.. కానీ, పలు కారణాలవల్ల రాధా నిశ్చితార్థం రద్దు చేసుకున్నారట.. సెప్టెంబర్‌ 6వ తేదీన నేరుగా వివాహానికి సిద్ధమయ్యారు..
బెజవాడలో వంగవీటి రాధా`పుష్పవల్లీ వివాహం ఘనంగా నిర్వహించాలన వంగవీటి ఫ్యామిలీ ఏర్పాట్లలో మునిగిపోయిందట.. ఇక, ఇటీవల ప్రధాన అనుచరులతో భేటీ కూడా ఇదే విషయం చెప్పటానికి ఓ సమావేశం ఏర్పాటు చేశారట వంగవీటి రాధా.. ఈ సమాచారం విూడియా వరకు వెళ్లడంతో.. సమావేశం రద్దు చేసి.. ఆత్మీయులకు మాత్రమే వివాహ విషయం తెలిపారట రాధా సన్నిహితులు. మొత్తంగా వంగవీటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. పార్టీలకు అతీతంగా వంగవీటి ఫ్యామిలీకి అభిమానులు ఉన్నారు.. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం లేకపోలేదు. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి అమ్మాని దంపతుల చిన్న కుమార్తెనే వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.. బాజ్జి దంపతలుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ద్వితీయ పుత్రిక పుష్పవల్లిని రాధాకు ఇచ్చి పెళ్లి చేయనున్నారు. జక్కం అమ్మాని 1987`92 వరకు నరసాపురం మున్సిపాలిటీ టిడిపి చైర్‌ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. పుష్పవల్లి స్కూల్‌, కాలేజ్‌ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొంత కాలం హైదరాబాద్‌లో యోగా టీచరుగా చేసిన పుష్పవల్లి.. ఒక ప్రైవేట్‌ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు.తండ్రి టిడిపి ఆవిర్భావం నుండి నరసాపురం రాజకీయాలలో కీలక పాత్ర పోషించేవారు. అయితే అనివార్య కారణాలవల్ల కొంతకాలం హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఇటీవలి కాలంలో మళ్ళీ నరసాపురంలో నూతన గృహ నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఈయన జనసేన పార్టీలో చేరి.. క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రలో భాగంగా నరసాపురం వచ్చినప్పుడు వీరి ఇంట్లోనే బస చేశారు. ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా వంగవీటి రాధా వీరి నివాసానికి వచ్చి.. రంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగానే రాధా మిత్రులు వివాహ సంబంధం గురించి ఇరువైపులా పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖరారైంది. . అనివార్య కారణాల వల్ల ఎంగేజ్‌మెంట్‌ డేట్స్‌ సర్దుబాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నా? నర్సాపురం అమ్మాయి? బెజవాడ అబ్బాయికి త్వరలోనే ఘనంగా పెళ్లి చేసేందుకు ఇరు పక్షాల పెద్దలు సమాయత్తమవుతున్నారు. నర్సాపురానికి చెందిన జనసేన ఇన్‌ఛార్జ్‌ నాయకర్‌, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం రాధా నర్సాపురం పర్యటనలో పాల్గొని కుటుంబ సభ్యులతో జరిగిన చర్చల సందర్భంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking