నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవు..

 

పట్టణ సీఐ వరగంటి రవి..

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 8

జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పట్టణ సీఐ వరగంటి రవి, ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో సరైనవాహన ధ్రువపత్రాలు లేని వాహనాలతో పాటు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ వరగంటి రవి, మాట్లాడుతూ, మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపిన కేసులు నమోదు చేస్తామని త్రిబుల్ రైడ్ చేస్తే పెనాల్టీ తో పాటు కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి వాహనాలు ఇవ్వకూడదని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి, తెలిపారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో సుమారు 60 వాహనాల వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వాహన యజమానులతో సిఐ మాట్లాడి నెంబర్ ప్లేట్ లేని వాహనదారులకు జరిమానా విధిస్తూ త్రిబుల్ రైడ్ చేసిన వారిని సైతం కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానా విధించారు ఇంకొకసారి ఇలాంటివి పునరావృతం అయితే జరిమానా తో పాటు కేసు నమోదు చేసి జైలుకు పంపించాల్సి ఉంటుందని సిఐ వాహన యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి, ఎస్సై టీ.వివేక్. తో పాటు పోలీసులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking