పంచ చలి వెంద్రాలను ఏర్పాటు చేసిన వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు.

మణికొండలొ తిరిగే బాటసారులకు ఎండాకాలం భానుడి తీవ్రమైన ధాటిని తట్టుకొని, దాహార్తిని పోంది సెద తీరడానికి గాను వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారు 9 చల్లని మంచి నీటి చలి వెంద్రాల ఏర్పాటుకు మునిసిపల్ కమీషనర్ అనుమతి గైకొని మొదటి దశగా 5 ప్రారంభోత్సవాలు:

గీతుస్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపెంద్రనాధ్ రెడ్డి సహకారంతో అలకాపురి రోడ్ 14 హైవ్ జంక్షన్ కూడలిలో, నెక్నంపుర్ బొడ్రాయి దగర, దిలీప్ కక్కడ్ వారి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం సెక్రెట్రియ్యేట్ కాలనీ గోల్డెన్ టెంపుల్ దారిలో గల ప్రతిభా స్కూలు ముందు, నాసిక్ నివాసి మధు సుధన్ మస్రాని సహకారంతో సుందర్ గార్డెన్: షిర్డీ సాయి/ శివాజీ నగర్ కూడలిలో వీరి అందరి సహకారంతో ఏర్పాటు చేయడ మైనదని చివరగా నరసింహ స్వామీ గుడి ఎదురుగా ఎల్.ఐ.సి కాలనీ బస్ స్టాండ్ ప్రక్కన మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తల్లి తండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడమైనదని తెలియ జేస్తు ఇట్టి సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించు కోవాలని ట్రస్ట్ తరపున వినమ్ర వినతి గావిస్తు రెండవ దశగా మిగిలిన నాలుగు అతి తొందరలో ప్రజల సౌకర్యార్థం మొదలు పెట్టగలమని,

నేటి ఈ శుభ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు నిర్మల్ చంద్ గొలేచా, దిలీప్ కక్కడ్, ఉపెంద్రనాధ్ రెడ్డి, మణికొండ 8 వార్డ్ కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, తబ్రెజ్ హుస్సేన్, మోహన్ కుమార్, నారోత్తం మరియూ 7 వ వార్డ్ కౌన్సిలర్ పద్మారావు, ఆరిఫ్ భాయ్, వినయ్ తదితర పురజన వాసులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలన్నీ విజయ వంతం గావించినారని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరచినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking