ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ నియోజకవర్గం ఫిబ్రవరి 19:
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నాచారం లో ఘనంగా నిర్వహించారు. నాచారం బిజెపి డివిజన్ అధ్యక్షులు కొమ్మగల్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడుతూ మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన ధైర్య సాహసాలు యువతకు ఆదర్శం అని వారు చూపిన మార్గంలో నడవాలి అన్నారు.
ఈ కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు ప్రకాష్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రాగిరి మోహన్ రెడ్డి, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు అభిషేక్ గౌడ్, చంద్రమౌళి, పాదం వెంకటేష్, అమర్ నాథ్, రవికాంత్, మంజుల వాణి, వెంకట్ నాయక్, ఓవి గౌడ్, ఉదయ్ కిరణ్ రెడ్డి, నవీన్ గౌడ్, సాయి గౌడ్, దర్శనల వెంకటేశ్వర్లు, ప్రతాప్ రెడ్డి, బాల కృష్ణ, వరలక్ష్మి, కల్పనా, నిత్య, పార్వతి, అరుణ, కృష్ణ గౌడ్, ప్రవీణ్, శేఖర్, వెంకటేష్, భాస్కర్, నవీన్ చింటూ, రాజు, కుశల్ వంశీ, మధు, రామ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.