జాకీర్ హుస్సేన్: విద్యా రంగానికి మార్గదర్శకుడు

 

భారతదేశం తమ వెలుగును పంచిన అనేక మంది దిగ్గజాల భూమి. వారు తమ తమ రంగాలలో నిరంతరం వెలుగుతూ స్వాతంత్య్రానికి పూర్వం. నుండి దేశాన్ని అన్ని రంగాలలో ప్రగతిశీలంగా మార్చడంలో సహకరిస్తూనే ఉన్నారు. అలాంటి దిగ్గజమే, డాక్టర్ జాకీర్ హుస్సేన్. ఆయన భారతదేశ రాష్ట్రపతిగానే కాకుండా, భారతదేశ విద్యను అభివృద్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన ఆంగ్లో- ముహమ్మదన్ ఓరియంటల్ కళాశాల (ప్రస్తుతం ఆలీఘర్ ముస్లిం యూనివర్శిటీ) చదివారు మరియు అక్కడ ఆయన విద్యార్ధి సంఘంనికి నాయకుడిగా కూడా వ్యవహరించారు.

ఆయన తన 23 ఏళ్ళ వయసులో, 1920లో కొంతమంది. తోటి విద్యార్థులతో కలిసి, నేషనల్ ముస్లిం యూనివర్శిటీ ని అలీఘర్ అలీఘర్ లో స్థాపించారు.. ఇదే ఇప్పుడు, వేలాది మంది వెనుకబడిన మైనారిటీ కమ్మూనిటీకి చెందిన విద్యార్థులకు నిలయంగా ఉన్న. జమీయా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ’ ఆయన, ఆర్థికశాస్త్రంలో Ph.D. పొందేందుకు, జర్మనీ వెళ్ళారు, కానీ అతి త్వరలోనే 1927లో మూతపడడానికి సిద్ధంగా ఉన్న జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ వ్యవహారాలను నిర్వర్తించడానికి, తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చారు. యుంజవర్శిటీ అధ్యక్షుడిగా, తన 21 సంవత్స రాల సర్వీసులో, అయన తమ జాతి మరియు దేశ అభివృద్ధి కోసం మొదటి స్థానం ఇచ్చారు.

విద్యకు సంబంధించి, మహాత్మాగాంధీ మరియు హnem అజ్మల్ ఖాన్ ల ఆలోచనలను వ్యాప్తి చెstuన్నప్పుడు , డా. హుస్సేన్, భారతదేశ స్వతంత్ర పోరాటంలో అత్యంత ప్రస్థితి చెందిన విద్యా సంస్కరణ వాదులలో ఒకరు గా అయ్యారు. భారతదేశం నుండి పాకిస్థాన్ విభజన తరువాత, ఆయన అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. అప్పుడు ఆయన విశ్వవిద్యాలయా నికి సంబంధించిన అధ్యాపకులు మరియు విద్యార్థులు ఎవరైతే పాకిస్తాన్ విభజన ఉద్యమంలో భాగం పంచుకున్నారో, పాకిస్తాన్ లో నివసించా లనుకుంటున్నారో, వారివి యూనివర్శటీ నుంచి నిషేధించారు. ముస్లిం సమాజాన్ని ఉద్భరించడానికి, ఆయన తన జీవితాన్ని అంకితం చేశాడు.

అందరికి విద్య అందించడంలో, డా. జాకీర్ హుస్సేన్ చేసిన కృషి ప్రశంసనీయం. ప్రతి ముస్లిం ఆయనను అమసరించి, విద్యరంగానికి అభివృద్ధి కోసం పాటుపడాలి. మన పూర్వీకులు విద్యారంగానికి వ్యవహారాలలో బాగానే సాధించినప్పటికీ, మనం మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉన్నాం. దీనిని మార్చవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకుని, విద్యారంగంలో మెరుగ్గా రాణించడానికి, దేశభక్తి పెంపొందించడానికి కృషి చేయాలి. ‘వర్తమానం యొక్క ఆదర్శాలు ఎల్లప్పుడూ గతం నుండి ప్రేరణ పొందుతాయి అన్న విషయం ఎవరూ కాదనలేని విషయం.

Leave A Reply

Your email address will not be published.

Breaking