న్యూఢల్లీి, జనవరి 12 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 13న ప్రపంచంలోని అత్యంత పొడవైన లగ్జరీ క్రూయిజ్ గంగా విలాస్ను ప్రారంభించనున్నారు. ఈ లగ్జరీ క్రూయిజ్ భారతదేశం, బంగ్లాదేశ్లోని ఐదు రాష్ట్రాలలో 27 నదీ వ్యవస్థలపై 3,200 కి.విూ. మేర ప్రయాణించనుంది. గంగా విలాస్ వారణాసి నుంచి ప్రారంభమై 51 రోజుల్లో దిబ్రూఘర్ చేరుకుంటుంది. గంగా నది క్రూయిజ్ ప్రారంభం ప్రధాని మోదీ నాయకత్వంలో బహుళ మంత్రిత్వ శాఖల సమన్వయం, సంపూర్ణ ప్రభుత్వ విధానానికి ఉదాహరణ అని కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వ వసంతాలు పూర్తవుతున్న తరుణంలో.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారతదేశ సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రదర్శించడానికి రివర్ క్రూజింగ్ వంటి వినూత్న పర్యాటక వనరులను, ఉత్పత్తులను అందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి భారీ`స్థాయి ఈవెంట్లతో భారతదేశ క్రూయిజ్ సామర్థ్యం పెరగడంతోపాటు.. ప్రపంచ క్రూయిజ్ హబ్గా మారగలదు.. అంటూ పేర్కొన్నారు. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ నాయకత్వంలో.. మిషన్ మోడ్లో గంగా నదిని శుభ్రపరచడం, పునరుజ్జీవింపజేయడం ప్రారంభించామమన్నారు. అందువల్ల పరిశుభ్రమైన నదులు నది క్రూజింగ్ వంటి పర్యాటక కార్యకలాపాలకు అవకాశం కలిగిందంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ఓప గంగా విలాస్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న శుక్రవారం వారణాసిలో ప్రారంభించనున్నారు. రాబోయే 50 రోజుల్లో ఈ విలాసవంతమైన క్రూయిజ్.. ఇండియన్ టూరిజం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతోపాటు భారతదేశ సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక వైభవాన్ని కూడా ప్రదర్శిస్తుందన్నారు.గంగా విలాస్ ప్రారంభం నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సంస్కృతి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..’’నదులను దేవతల రూపంలో పూజించే దేశం మనది. భారతీయ నదీ విహారయాత్రలు ఆధ్యాత్మిక విలువలను పెంచడంతోపాటు.. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ మరింత అనుభూతిని అందిస్తాయి’’ అని అన్నారు. ‘‘2014 నుంచి గత 8 సంవత్సరాలలో, మన నదులను శుభ్రపరచడానికి గణనీయమైన కృషి జరిగిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ నాయకత్వంలో, తాము మిషన్ మోడ్లో గంగా నదిని శుభ్రపరచడం, పునరుజ్జీవింపజేయడం ప్రారంభించామన్నారు.అందువల్ల స్వచ్ఛమైన నదులు నది క్రూజింగ్ వంటి పర్యాటక కార్యకలాపాలకు సంభావ్యతను నిర్ధారించాయన్నారు. క్రూయిజ్ టూరిజం ప్రారంభించడం ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో పనిచేసే బహుళ`మంత్రిత్వ శాఖల సమన్వయానికి ఉదాహరణ అని.. ఇది ప్రభుత్వ ఘనత అని కొనియాడారు. గంగా నదిని శుభ్రపరిచే అంతర్లీన పని జలశక్తి మంత్రిత్వ శాఖ క్రిందకు వస్తుంది. నౌకాశ్రయాలు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ ద్వారా క్రూయిజ్ టూరిజం విధానం రూపొందించారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆకర్షణీయమైన పర్యాటక ఉత్పత్తులు, అనుభవాలను, మార్కెట్లను రూపొందించడంలో సహాయాన్ని అందించడంతోపాటు గమ్యస్థానాన్ని నిర్ధారిస్తుందని తెలిపారు.గంగా విలాస్ ప్రయాణం, గంగా, బ్రహ్మపుత్ర నదిపై కొనసాగుతుంది. వారణాసి నుంచి 13న ప్రారంభమవుతున్న క్రూయిజ్ ప్రయాణం.. 51 రోజుల తర్వాత మార్చి 1 2023న అస్సాంలోని దిబ్రూఘర్లో ముగుస్తుంది. ఈ క్రూయిజ్ వారణాసిలోని ప్రసిద్ధ గంగా ఆరతి వంటి వారసత్వ ప్రదేశాలు, కాజిరంగా నేషనల్ పార్క్, సుందర్బన్స్ డెల్టా వంటి అభయారణ్యాలతో సహా 50 ప్రధాన పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. క్రూయిజ్ బంగ్లాదేశ్లో సుమారు 1,100 కిలోవిూటర్లు ప్రయాణిస్తుంది.కాగా, క్రూయిజ్ విశేషాల గురించి కేంద్రమంత్రి అంతకుముందు ట్వీట్ చేశారు. ఈ 51 రోజుల్లో పర్యాటకులు 3200 కిలోవిూటర్ల దూరం ప్రయాణించనున్నారు. ఈ పర్యటన మజులి ద్వీపం విూదుగా పాట్నా, కోల్కతా, ఢాకా (బంగ్లాదేశ్), సాహిబ్గంజ్, గౌహతి వరకు కొనసాగుతుంది. ఈ నౌకలో ప్రయాణించే పర్యాటకులు ఈ రెండు నదుల ఒడ్డున ఉన్న ప్రసిద్ధ నగరాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు.ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ షిప్ టూరిజం ప్రాజెక్ట్కు సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. భారతదేశం, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల గుండా ప్రయాణించే పర్యాటకుల భద్రతపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలు, భద్రతా ప్రోటోకాల్ను జాగ్రత్త పర్యవేక్షిస్తున్నాం.. దేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. భారత ప్రభుత్వం దేశంలోని క్రూయిజ్ టూరిజం పరిశ్రమను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో మౌలిక సదుపాయాల నవీకరణలు, పోర్ట్ రుసుము హేతుబద్ధీకరణ, ఛార్జీల తొలగింపు, క్రూయిజ్ షిప్లకు ప్రాధాన్యతా బెర్త్లు, ఇ`వీసా సౌకర్యాల ఏర్పాటు.. క్రూయిజ్ ప్రయాణీకుల రద్దీని ప్రస్తుతం 0.4 మిలియన్ల నుంచి 4 మిలియన్లకు పెంచాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే సంవత్సరాల్లో క్రూయిజ్ టూరిజం ఆర్థిక సామర్థ్యం వి110 మిలియన్ల నుంచి వి5.5 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. దీన్ని గ్రహించేందుకు కేంద్రం 100 జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేసే పనిని చేపట్టింది. కార్గో తరలింపుతో పాటు ఈ జలమార్గాలపై ప్రపంచ స్థాయి క్రూయిజ్ షిప్లు నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 12 ప్రాజెక్టులు రూ. 1,098 కోట్లు భారతదేశంలో క్రూయిజ్ షిప్పింగ్కు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చేపట్టబడుతున్నాయి. ఈ ప్రాజెక్టులలో మెజారిటీకి, మేజర్ పోర్ట్లలో అనుబంధ సౌకర్యాలతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నాం’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.