అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

హైదరాబాద్ ఫిబ్రవరి 25 ;అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు మహాకాళీ మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు జి.అరవింద్ కుమార్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కె.వెంకటేష్ లు శనివారం గవర్నర్ దత్తాత్రేయ ను రాంనగర్ లోని అయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకాన్ని అందజేశారు.ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ చారిత్రిక నేపథ్యం, బోనాల సంస్కృతి, లాల్ దర్వాజా సింహ వాహినీ శ్రీ మహాకాళి అమ్మవారిని కీర్తిస్తూ దేశ విదేశాల్లో ఉన్న జగత్గురువులు,పండితులు కవులు, కవయిత్రులు ,ఎందరో మహానుభావులు రాసిన దాదాపు 526 కవితల తో కూడిన పుస్తక సంకలనం చరిత్రలో నిలిచి పోతుందని బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మహ కార్యానికి కారకుడు అయిన స్వర్గీయ గౌని మహేష్ గౌడ్ చిరస్మణీయుడు అని దత్తాత్రేయ కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking