బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిగోపాల్
ఘనంగా టిఫిన్ బైటక్ కార్యక్రమం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 : కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని,నరేంద్ర మోదీ హాట్రిక్ పీఎం అవుతాడని బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాల్ పేర్కొన్నారు. శనివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ పార్టీ పిలుపుమేరకు మున్సిపాలిటీ పరిధిలో శక్తి కేంద్రoలో పలుచోట్ల జెండా ఎగరవేసి టిఫిన్ బయటక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటే అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విరమల్ల హరి గోపాలరావు,పట్టణ ఇన్చార్జి నరేష్ జెన్, మోటపలుకుల తిరుపతి, రమేష్ జైన్,ప్రధాన కార్యదర్శి రమణ,మోటపలుకుల సతీష్,సాయి సచిన్, ఉపాధ్యక్షులు వెంబడి వెంకటేష్,పరిపాల రమేష్, కోమాకుల రవి,బీసీ అధ్యక్షులు పాంచాల రమేష్, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.