అక్రమంగా మట్టిని తరలిస్తున్న 3 టిప్పర్లు సీజ్

 

మనోహరాబాద్, ఏప్రిల్ 18 ( ప్రజాబలం న్యూస్ ) :-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో అక్రమ మట్టి రవాణా చేస్తున్న మూడు టిప్పర్ లు సీజ్. మండలంలో బుధవారం అర్ధ రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి కొడుతున్న మూడు టిప్పర్ లను మనోహరాబాద్ శివారులో పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. మండలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ మట్టి రవాణా చేసినట్లయితే చట్ట పరంగా చర్యలు తీసుకొని సీజ్ చేయడం జరుతుందని మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking