కొర్విచెల్మ ఎస్ ఎస్ సి 2001-2002 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 02 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో జెట్ పి.ఎస్.ఎస్ 2001-2002 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ముత్యంపేట దుర్గా ఫంక్షన్ హాల్ నందు జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చాలా రోజుల తర్వాత కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఒకరు ఒకరు మాట్లాడుకుంటూ,మనసులో భావాలను పంచుకుంటూ, ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అన్నారు.అనంతరం గేమ్స్, స్పీచ్,సాంగ్స్,ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. అందరూ ఒక చోట ఉండి భోజనం కార్యక్రమాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, హరికృష్ణ,రాజేంధర్, వేణుగోపాల్,శ్రీనివాస్, మురళి,రవీందర్, మల్లేష్,కిషన్,రమేష్, మహేందర్,మొగిలి,జ్యోతి, మౌనిక,నాగమణి,భాగ్యలక్ష్మీ,తిరుమల,సరిత,శ్రీవాణి, సౌజన్య, మంగ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking